15-06-2025 12:00:00 AM
డా. ఐ.చిదానందం :
నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి :
ప్రతి కవి తాను రాసేది తోటివారు మెచ్చుకోవాలని ఆశిస్తా డు. ఆత్మవిశ్వాసం గల కవి మాత్రం తన గీతం జాతి జనులు పాడుకొనే మంత్రంగా మారాలనీ కోరుకుంటాడు. అలాంటి గంభీర కోరికను సాధించగలిగిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ). ఆయన కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యపు మార్గదర్శిగా నిలిచింది. తన రచనలు సామాజిక చైతన్యం, వర్గ సమర శక్తిని కలిగించినవే.
బహుశా ఈ కారణంగానే తన రచనలు కాలాన్ని దాటి విస్తరించాయి. కానీ, శ్రీశ్రీపట్ల ఆయన బంధువు, ప్రముఖ విమర్శకుడు, సమగ్రాంధ్ర సాహిత్యకర్త, కవి అయిన ఆరుద్ర స్పందన విశేషంగా ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకే యుగంలో, ఒకే ఆవేశంలో, మార్క్సిస్టు సిద్ధాంతాలపై కలిసి జీవించిన వారు. మద్రాసు నగరం లో ఒకే కాలక్షేపం గడిపిన వారు.
అయినా, ఆరుద్ర విశ్లేషణలో శ్రీశ్రీపట్ల అభిమానం కన్నా విమర్శా నిశితత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరుద్రకు శ్రీశ్రీ కవిత్వంలోని కొన్ని అంశాలపై అసంతృప్తి ఉండేదని ఆమూల విశ్లేషణల ద్వారా తెలుస్తుంది. అవి వ్యక్తిగతం కాక సాహిత్య సంబంధమైనవిగానే మనం పరిగణించవచ్చు. ప్రత్యేకంగా ‘మహాప్రస్థానం’పట్ల ఆయన వ్యాఖ్యలు బహుళాంశాలను అందిస్తాయి.
విలువైన ఆరుద్ర తీర్పులు
శ్రీశ్రీ రచనలపై ఆరుద్ర అభిప్రాయాలు రెండు దిశలలో కనిపిస్తాయి. ఒకవైపు సాహిత్య పటుత్వం పట్ల గౌరవం, మరోవైపు అంతర్గత సంఘర్షణలపై విమర్శ. ఉదా॥కు, ‘ఖైదీ పటేల్కి’, ‘చరిత్రకు రిపోర్టు’, ‘దాసపల్లీ పుల్లా’ వంటి కవితల్లోని మౌలిక భావజాలం ఆరుద్రను ఎంతగానో ఆకర్షించినా, కొన్నిటిలోని వ్యక్తిగత అతి భావోద్వే గాలు, అతిశయోక్తులను ఆయన ఇష్టపడలేదు.
శ్రీశ్రీని విమర్శించడమంటే వ్యక్తిని కాదు, ఆయన భావజాలాన్ని, ప్రకటనా శైలిని ప్రశ్నించడం. ఆరుద్ర చేసిన విమర్శ లు కూడా ఇలానే వ్యక్తిగత దూషణలు కా కుండా సాహిత్య భేదాలు మాత్రమే. స్నే హబంధం ఉన్నా సాహిత్య సమీక్షలో ఆ యన నిజాయితీ వదల్లేదు. అందుకే, శ్రీశ్రీ సాహిత్యాన్ని మోపిన ఆరుద్ర తీర్పులు మ రింత విలువైనవిగా నిలుస్తున్నాయి.
శ్రీశ్రీ తొలి రచనగా ‘సమరాహ్వనము’ అనే పద్యరచన ‘భారతి’ పత్రికలో అచ్చయి న సందర్భం ఆయన రచనా జీవితానికి దారితీసిన తొలి అడుగు. అయితే, ఆరుద్ర చే సిన వ్యాఖ్యను పరిశీలిస్తే ఈ రచనపట్ల విమర్శాత్మక దృష్టికోణం స్పష్టమవుతుం ది. ‘భారతి’లో అచ్చయినా పేలవమైన రచ న ఇది. ఎందుకంటే, ఇది తిరుపతి వెంకట కవుల ‘పాండవ విజయం’ నాటకంలోని 7వ అంకానికి అనుసరణ మాత్రమే.
అయితే, డా. కేవీ.రమణారావు ఆధునిక కవి త్వ రూపాంతరాలపై సమీక్షా సి ద్ధాంతాలు వ్యాసంలో శ్రీశ్రీ తొలి రచనలపై తటస్థ విశ్లేషణ చేశారు. ‘ప్రభవ’ కవితా సంకలనం ఆవిర్భావ నేపథ్యాన్ని చూస్తే శ్రీశ్రీ 1925 నుంచి 1928 మధ్య రాసిన 16 ఖండికలు తరువాత తెలుగునామ సంవత్సరం ‘ప్రభవ’ నామంతో 1928లో ఒక కవితా సంకలనంగా వెలువరించారు. వీటిలో ప్రాధాన్యంగా కనిపించే అంశం భావకవిత్వ శైలిలో ప్రవహించిన పద్యాలు.
కానీ, ఏ మాత్రం శృంగారికతను ఆశ్రయించకుండా, ప్రేయసిపట్ల కాకుండా, పరమే శ్వరుని పట్ల అంకితభావంతో రాశారు. ఇది కేవలం భక్తిరస కవిత్వం కాదు. ఇది ఒక నాస్తికుడు రాసిన భక్తిమార్గపు ఆత్మనివేదనా కాదు. ఈ పద్యాలలో కనిపించే తాత్వికత, శరణాగతి, ఆత్మార్పణ భావాలు శ్రీశ్రీ నాస్తికుడిగా భావింపబడే వ్యక్తిత్వానికి విరుద్ధంగా కనిపించినా, ఇది కవి లోపలి వ్యక్తిగత ఆధ్యాత్మిక తర్కానికి ప్రతిరూపం గా నిలుస్తుంది.
నిలువెత్తు సాత్వికాహంకారం
తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ స్థానం విశిష్టమైంది. ఆధునికతకు ప్రతీకగా భావించ బడే ఆయనను మానవవాద భావజాలానికి ప్రతినిధిగా చూసినవారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారి వ్యక్తిత్వంలో అహంభావం కేవలం తనదే మార్గమన్న మానసిక స్థితి ఉన్నదన్న విమర్శలుకూడా లేకపోలేదు. వాటిలో ముఖ్యమైనవి ఆరు ద్ర చేసినవి.
అలాగే, కవిసామ్రాట్ విశ్వనా థ సత్యనారాయణతో శ్రీశ్రీకి ఏర్పడిన మేధో సంగ్రామం, దశాబ్దాలకు పైగా తెలు గు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశమై నిలిచింది. విశ్వనాథ సత్యనారాయణపట్ల శ్రీశ్రీ కి ఒక విషాద భక్తిభావం మొదట ఉండేది. మద్రాసులో ఉన్నప్పుడు ఆయనను బతికించిందేమిటంటే ఒకటి మున్సి పాలిటీ కుళాయి నీళ్లు, రెండవది విశ్వనాథ పద్యా లు అనీ చెప్పారు.
అంతటి అభిమానాన్ని కలిగిన కవిపట్ల అనంతరం వ్యం గ్యంగా మాట్లాడడం శ్రీశ్రీ స్వభావానికి ప్రతిబిం బం. ‘రామాయణ కల్పవృక్షం’ పట్ల ఆయ న వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘తెలుగు వచ్చి నా కల్పవృక్షం అర్థం కాలేదని’ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ‘విశ్వనాథకంటే గుంటూరు శేషేంద్రశర్మ సంస్కృతంలో గొప్పవాడు’ అనే ప్రకటనా చేశారు.
తెలుగు ఆధునిక కవిత్వ చరిత్రలో శ్రీశ్రీ రచించిన అనేక రచనలు ఉన్నా ‘మహాప్రస్థానం’ కవితా సంపుటికి ఉన్న ప్రత్యేక స్థా నం అసాధారణం. ఇది కేవలం కవిత్వ సం కలనం మాత్రమేకాక ఒక నూతన భావధారకు పునాది. సామాన్య ప్రజల దుస్థితి, వ ర్గ సంఘర్షణ, విప్లవభావాలకు కవిత్వరూపంగా శ్రీశ్రీ నిర్మించిన శిల్పం ఇది.
‘మహా ప్రస్థానం’ (1933-1947) సామాజిక చైత న్యం నిండిన గాథ. ప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం సంపాదించిన ఈ గీతాలు స్వయంగా శ్రీశ్రీ రచించిన అనంతర కాలంలోనూ ఆయనకు స్ఫూర్తిదాయకంగా నిలి చినట్లు తెలుస్తుంది. ఈ కవితల ప్రభావా న్ని ఆరుద్ర విమర్శాత్మకంగా విశ్లేషించారు.
కట్టిపడేసే గట్టి కవిత్వం
శ్రీశ్రీ ‘కళారవి’ అనే గీతం మాధుర్యంతోపాటు ధ్వన్యాత్మకమైన పదప్రాసలతో కట్టి పడేస్తుంది. ‘పోనీ పోనీ/ పోతేపోనీ/ సుతుల్ సుతుల్ హితుల్ పోనీ/ వస్తే రానీ/ కష్టాల్ నష్టాల్/ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ’. ఈ గీతాన్ని పరిశీలించిన ఆరుద్ర దీనిలో అన్నమాచార్యుల సంకీర్తనల శైలీప్రభావం ఉందని వ్యాఖ్యానిం చారు. ముఖ్యంగా ‘నేనెందువోయె తావెం దు వోయె... రానీలె రానీలె...’ అనే అన్నమాచార్య కీర్తనలోని ధ్వనులాగానం, పద ప్రాసల ధ్వని ఈ గీతంలో వినిపిస్తుందని వారు గుర్తించారు.
ఈ వ్యాసంలో శ్రీశ్రీ కవిత్వంలోని ప్రభావాలను ఎత్తి చూపడం, ఆయన స్వతంత్రతను తక్కువ చేసే ప్ర యత్నం కాదు. ఇది కేవలం విమర్శా పద్ధతిలో సాహిత్యంలో ప్రభావాలు ఎలా పని చేస్తాయో, అవి ఒక కవిని ఎలా తీర్చిదిద్దతాయో విశ్లేషించడమే. ప్రతి కవి ఓ అస్తి త్వాన్ని సృష్టించుకునే ముందు వచనాల, భావాల, శైలీ ప్రభావాలకు లోబడి, వాటి ని మింగి, తనదైన ధ్వని, స్వరూపం ఏర్పరచుకుంటాడు.
ఏ రచయిత అయినా పూర్తి శూన్యత నుంచి ఎదగడు. ప్రభావాల నుం చే ప్రకాశం వస్తుంది. కానీ, ఆ ప్రభావాల నుంచే ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని తనదైన దారిలో నడవగలిగి నవాడు మాత్రమే సాహిత్యంలో మహాకవిగా నిలిచే సామర్థ్యాన్ని సంపాదిస్తాడు. చివరగా ప్రభావం అనేది పరాధీనత కాదు ; ప్రతిభకు అది పునాది.
వ్యాసకర్త సెల్: 8801444335