12-02-2026 12:00:00 AM
(దుమ్ముగూడెం) చర్ల, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మండలంలోని ములకాపాడు ప్రధాన రహదారిపై లారీల బీభత్సానికి మరో మహిళ ప్రాణం బలైంది, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ గొల్లగూడెం గ్రామానికి చెందిన కొట్టెం కమల (45) వ్యక్తిగత పనుల నిమిత్తం భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యంలో ములకపాడు ప్రధాన రహదారిపై లారీ ఢీకొని కమల మృతి చెందారు.
ఈ సంఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై లారీలకు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని ఇంకెంత మంది ప్రాణాలు పోతే గాని ఈ ప్రభుత్వానికి చలనం రాదని మండిపడుతున్నారు,ఈ ఇసుక లారీల వలన ఇప్పటికి అనేక ప్రమాదాలు జరిగినా నివారణ చర్యలు అంతంత మాత్రం గానే ఉన్నాయి ప్రజలు మండిపడుతున్నారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.