04-06-2025 12:04:56 AM
- లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గణేశ్
జగిత్యాల అర్బన్, జూన్ 3: భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఓ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.10 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్చార్జి తహసీల్దార్ జతంగుల గణేశ్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం.. రాయికల్ మం డలం సింగర్రావుపేట గ్రామం లో 1.25 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఫిర్యాదుదారునికి అనుకూలంగా వ్యవహరించేందుకు తహసీల్దార్ గణేశ్ డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ ద్వారా రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఫిర్యాదుదారుడు మధ్యవర్తి ముజాఫర్కు రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ గణేశ్తో పాటు ముజాఫర్ను అరెస్టు చేశారు.