17 April, 2026 | 10:05 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మావోయిస్టు చేతిలో మరో మహిళ హతం

08-12-2024 05:21 PM

24 గంటలు గడవకముందే మరో హత్య 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సిపిఐ ఎంఎల్ మావోయిస్టు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. లక్ష్మీ అనే అంగన్వాడి టీచర్ను హతమార్చి 24 గంటలు గడవకముందే మరో మహిళను గొంతు కోసి హతమార్చిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దెడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోడెడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో కెళ్తే తెలంగాణ పోలీస్ ఇన్ ఫార్మర్ అని ఆరోపిస్తూ లోడెడ్ గ్రామానికి చెందిన శుక్ర యాలం, ఆమె భర్త రామయ్యను ఈనెల ఏడవ తేదీన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. రామయ్యను కర్రలతో విపరీతంగా కొట్టి విడుదల చేశారు.

అనంతరం శుక్రవారం గొంతు కోసే హతమార్చారు తెలంగాణ పోలీసులకు ఆమె ఎన్ ఫార్మర్ గా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున మరోసారి మెరుపు దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే బీజాపూర్ జిల్లా పరిధిలోని పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి పోలీస్ క్యాంప్-2 పై మెరుపు దాడి చేశారు. పోలీసులే టార్గేట్టుగా నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనుకొని సంఘటనకు వెంటనే చేరుకున్న పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.