03-06-2025 08:16:07 PM
ప్రిన్సిపాల్ దేవానంద్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపల్ జి దేవానంద్(ITI Principal G Devanand) తెలిపారు. ఐటిఐలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటిఐలో రెండు సంవత్సరాల కోర్సులైన ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, సం.. కోర్స్ డీజిల్ మెకానిక్, లతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) లో రెండు సంవత్సరాల కోర్సులైన అడ్వాన్స్ సీఎన్సి మ్యాచింగ్ టెక్నీషియన్, బేసిక్ డిసిగ్నేర్ అండ్ వర్క్యువల్ వెరిఫైర్ (మెకానికల్), మెకానిక్ ఎలక్ట్రక్ వెహికల్, సంవత్సరం కోర్సులు ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అర్హులైన పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 2 నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.