బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(University College of Engineering), కాకతీయ విశ్వవిద్యాలయం, కొత్తగూడెంలో బీటెక్ కోర్స్ చేయుట కొరకు దరఖాస్తులు కోరడమైనదని ఏరియా జియం వి.కృష్ణయ్య(Area Gm V. Krishnaiah) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు ఈ క్రింద తెలిపిన వివిధ విభాగాలలో కేటాయించారని తెలిపారు.
మైనింగ్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, ఎలక్ట్రికల్ & ఎలెక్ట్రోనిక్ ఇంజనీరింగ్ 2, ఎలెక్ట్రోనిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2 మొత్తం 10 ఇట్టి దరఖాస్తు చేసుకునే యువతి యువకులకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రము నిర్వహించిన 2024-25 ఎంసెట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు లో హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ స్పష్టంగా నమోదు చేయాలి. దరఖాస్తులో 2024-25 ఎంసెట్ మెరిట్ యొక్క జిరాక్స్ కాపీ సమర్పించాలి. దరఖాస్తులో కుల ధ్రువీకరణ పత్రం, స్తానికం/నాన్-లోకల్ సమర్పించాలి. కౌన్సిలింగ్ సమయంలో ఉద్యోగి యొక్క ఐ.డి. కార్డును సమర్పించాలి. కౌన్సిలింగ్ లో ఎంపికైన అభ్యర్ధులు ప్రవేశ రుసుము చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు లను జూలై నెల 14వ తేదీ లోపు అందజేయాలిని తెలియజేశారు.






