27-05-2025 07:01:28 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మాజీమంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మంగళవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) పరామర్శించారు. సత్యవతి రాథోడ్ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.