calender_icon.png 28 May, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ సేవలు చిరస్మరణీయం

27-05-2025 06:45:51 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): భారత ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాయపోల్ మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు దయాకర్, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ స్వామిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన రాయపోల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి(Jawaharlal Nehru Death Anniversary)ని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడిగా, భారత తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ దేశానికి అందించిన సేవలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, దుర్గ ప్రసాద్, ప్రశాంత్, ఇంద్రకరణ్, యాదగిరి, కనకయ్య, ఎల్లం, బాబు, అశోక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.