నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి
03-04-2026 12:00 AM
తహశీల్దార్ సతీష్ కుమార్
పాపన్నపేట,ఏప్రిల్2: నూతన రేషన్ కార్డు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ సతీష్ కుమార్ సూచించా రు. గురువారం పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించారు. వివిధ శాఖాధికారులు ప్రగ తి నివేదికను చదివి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు తగు సూచ నలు చేశారు. కార్యక్రమంలో డీఎల్పివో సురేష్ బాబు, వైద్యాధికారి అన్వర్, ఆర్అండ్ బి ఏఈ రవి, కార్యదర్శి నయీమ్, సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




