25-10-2025 08:49:37 PM
చేర్యాల: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అన్ని కేటగిరీలలో ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు పరిమిత సీట్లు ఉన్నాయని అర్హత కలిగిన బాల బాలికలు ఈనెల 28వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పాస్ ఫోటో సైజ్ ఫోటోలతో చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి పోలోజు నరసింహాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.