17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

గుంతలు పూడ్చాలని రాస్తారోకో

22-05-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే21( విజయక్రాంతి): జిల్లా కేంద్రం నుండి ఆదిలాబాద్ క్రాస్ రోడ్ వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పుడ్చాలని మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భం గా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ రహదారిపై పెద్ద పెద్ద గుంతలుఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గుంతల్లో మురికి నీరు చేరి కాలినడకన వెళుతున్న ప్రజలపై మురుగునీరు పడుతుంద న్నారు. రోడ్డు గుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయాణం చేస్తున్నప్పటికీ గుంతలు కనపడలేదా అని ప్రశ్నిం చారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్ అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను వినింపజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమే ష్, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాజేందర్, టీకానంద్, మాల శ్రీ నాయకులు కార్తీక్, తిరుపతి, నిఖిల్,శ్రావణి పాల్గొన్నారు.