14-01-2026 12:28:11 PM
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు(Pakistani drones) కలకలం రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని(Rajouri) నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్లను సైనిక దళాలు ధ్వంసం(Army Opens Fire) చేశాయి. రాజౌరి పాక్ డ్రోన్లపై కాల్పులు జరపడం మూడ్రోజుల్లో రెండోసారని సైన్యం తెలిపింది. డ్రోన్లు కనిపించిన వెంటనే మానవరహిత వైమానికి వ్యవస్థను క్రియాశీలం చేసినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం వేడుకలు దగ్గర పడుతున్న వేళ జమ్ముకాశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సైన్యం ప్రకారం... నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజౌరి జిల్లాలోని చింగస్ ప్రాంతంలోని దుంగా గాలా మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్లపై భారత సాయుధ దళాలు కాల్పులు జరిపాయి. ఆ తరువాత డ్రోన్లు అదృశ్యమై అవతలి వైపుకు వెనక్కి తగ్గాయని సైన్యం వెల్లడించింది. సాయంత్రం 7:35 గంటల ప్రాంతంలో ముందుకు ఉన్న ధేరి ధార గ్రామం మీదుగా రెండు డ్రోన్ కదలికను ఆర్మీ సిబ్బంది గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుని అనేక లైవ్ రౌండ్లు కాల్చారు. డ్రోన్లు మంజాకోట్ సెక్టార్లో కొద్దిసేపు ఉండి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కు తిరిగి వచ్చాయి.
జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లు కనిపించిన తర్వాత సైన్యం డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ చర్యలను అమలు చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. డ్రోన్ల ద్వారా ఎలాంటి ఆయుధాలు, మాదకద్రవ్యాలు గాలిలోంచి జారవిడవబడలేదని నిర్ధారించుకోవడానికి భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించారు. గత ఆదివారం, నౌషేరా సెక్టార్లో కాపలా కాస్తున్న సైనికులు గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికలను గమనించి, మధ్యస్థ, తేలికపాటి మెషిన్ గన్లతో కాల్పులు జరిపారు. అదే రోజు, రాజౌరిలోని తెరియాత్లో ఉన్న ఖబ్బర్ గ్రామం, పూంచ్ జిల్లాలోని మన్కోట్ ప్రాంతంలోని తైన్-టోపా, సాంబా జిల్లాలోని రామ్గఢ్ సెక్టార్లోని చక్ బాబ్రాల్ గ్రామాలపై కూడా డ్రోన్ కదలికలు గుర్తించబడ్డాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.