17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అగ్రంపహాడ్ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి

28-01-2026 09:38 PM

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి నాగేశ్వరరావు, పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, ఇతర అధికారులతో కలిసి జాతరలో ఏర్పాట్లు, నిర్వహణ అంశాల గురించి అదనపు కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ అగ్రం పహాడ్  శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా బాగుండాలని ఎంపీడీవో కు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.