31-08-2025 06:11:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శోభయాత్ర నిర్వహినకు ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు తెలిపారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని బంగల్పేట చెరువు వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు అందించారు. చెరువు వద్ద క్రేన్లు భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్రబోతు రాజేందర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.