జహీరాబాద్, ఏప్రిల్ 23 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కమాల్పల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం అరుణాచల్ప్రదేశ్ ఏఎస్ఆర్బీ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సోమవారం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో శ్రీశైలం ఏఎస్ఆర్బీ వ్యవసాయ శాస్త్రవేత్తగా అరుణాచల్ ప్రదేశ్ క్యాడ ర్ లభించింది. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగంలోని జడ్పీహెచ్ఎస్, ఇంటర్మీడియట్ డీఆర్డీవో, గ్రాడ్యు యేషన్ జయశంకర్ అగ్రికల్చర్ యునివర్శి టీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనారస్ హిందూ యునివర్శిటీ, పీహెచ్డీ తిరుపతి ఎన్జీ రం గా అగ్రికల్చర్ యునిరివర్శిటీలో పూర్తి చేశా డు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైనందుకు ప్రజాప్రతినిధులు అభినందించారు.