ఎక్సైజ్ స్టేషన్లో ద్విచక్ర వాహనాల వేలం పాట
06-05-2026 12:07 PM
ఇల్లందు మే06, (విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్వాధీన పరుచుకున్న 3 ద్విచక్ర వాహనాల వేలం పాట మే 7, 2026న ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ కార్యాలయంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన వారు అవసరమైన పత్రాలు, డిపాజిట్తో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సంబంధిత ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.






