calender_icon.png 27 June, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలకు అధికారులే అండ!

27-06-2025 12:58:10 AM

- చైన్ మెన్ లను ప్రోత్సహిస్తూ అందిన కాడికి దండుకుంటున్న వైనం

- జిహెచ్‌ఎంసి ఆదాయానికి భారీగా గండి కొడుతున్న సర్కిల్ అధికారూలు 

శేరిలింగంపల్లి,జూన్ 26: రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి ని అంతా మినీ ఇండి యా గా భావిస్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ వచ్చి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ఇక్కడ రియల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా రియల్ రంగం వే గంగా దూసుకుపోతుంది. దీనినే కొందరు అక్రమార్కులు క్యాచ్ చేసుకొని తమ జేబు లు నింపుకుంటున్నారు. స్థానిక అధికారులను మచ్చిక చేసుకుని అందిన కాడికి దం డుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి పన్ను ల రూపంలోరావాల్సిన కోట్ల ఆదాయానికి గండి పడుతుంది.

ప్రధానంగా నియోజకవర్గంలోనిచందా నగర్ సర్కిల్-21లో, జిహెచ్ ఎంసి వెస్ట్ జోన్ పరిధిలో యథేచ్చగా అక్ర మ నిర్మాణాలు... అనునిత్యం పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. ఉన్నతాధికారుల ఉదాసీనతతో జీహెచ్‌ఎంసీ అధికారులకు వరంగా మారింది. టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీ రుపై విమర్శలు గుప్పుమంటున్నా.. సైలేం ట్గా పని కాన్నిచేస్తున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ.. అక్రమ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో అక్రమ నిర్మాణాలు సాఫీగా సాగు తున్నాయి.

చాందానగర్ సర్కిల్ -21 లో పలువులు రియల్ బిల్డర్ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ సెల్లార్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలు తెరలేపుతున్నారు. సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట్,మదాపూర్, చందా నగర్ డివిజన్ లలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జోరు సాగుతుంది. వీటిని అరికట్టాల్సిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం (ఎస్టీఎఫ్), న్యాక్ బృందాలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికుల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారి నుంచి సెల్లార్లు,అదనపు అంత స్తుల ను లెక్కగడుతూ అక్రమార్కుల నుంచి రూ. లక్షల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు వసూళ్లకు పాల్పడుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకున్నారని స్థానికులు బహిరంగానే చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు సర్కిల్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఒక కన్నేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

చేతులు తడిపితే అక్రమ నిర్మాణాలకు జై....

జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు అధికారుల అండ దండలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తవుతుంటే అందరూ అవాక్కవుతున్నారు. పర్మిషన్లు ఉన్నాయా..? లేదా..? అసలు అనుమతి కోసం టీఎస్ బి పాస్ లో అప్లై చేసుకున్నా రా..? అనే ప్రశ్నలకే తావులేకుండా అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా అంతస్థుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు.

ఆ వైపు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లా నింగ్ అధికారులు, సిబ్బంది వెళ్లినా చూసీ చూడనట్టుగా వ్యవహరించడం, అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండడంతో ఈ తరహా నిర్మాణాలకు జోరందుకున్నాయి. చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని పలు డివిజన్ లలో అనేక నిర్మాణాలు సాగుతున్నా.. అనుమతులు మాత్రం కొన్నింటికే ఉన్నాయని తెలుస్తోంది. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు వాటి విషయంలో నోటీసులతో సరి పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదా యానికి గండి పడుతుందని తెలిసినా ఏ లాభాపేక్ష కోసం అక్రమార్కులకు వంత పాడుతున్నారో వారికే తెలియాలి మరి.

అనుమతులకు విరుద్ధంగా....

చందా నగర్ సర్కిల్ 21 పరిధిలోని విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతు న్నాయి. వీటిలో చాలా వాటికి జీ+2 అనుమతులున్నా.. ఐదు ఆరు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. స్థలం తక్కువున్నా, ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే, సెల్లార్లు తవ్వేసి 5, 6 అంతస్థుల మేడలు కట్టేస్తున్నారు. ఇంకొందరు అయితే 60 నుంచి 200 గజాల లోపు స్థలాల్లోనే 5 అంతస్తులు కట్టేస్తున్నారు. వీటివల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బందులతో పాటు పలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు,కోర్టు ఆదేశాలు భేఖాతర్..!

ప్రధానంగా గోకుల్ ప్లాట్స్, గురుకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండి యా లాంటి వివాదాస్పద భూముల్లో కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి యథేచ్చగా భారీ భవన నిర్మాణాలు సాగిస్తున్నా రు. ఇక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి.కొందరు బిల్డర్లు, నిర్మాణదారులు ఏకంగా 5, 6 అంతస్తులు కట్టేసి వాటిపై మరో పెంట్ హౌస్ నిర్మాణం జరుపుతున్నారు. వీటిలో ఎక్కడా కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు. అయినా ఈ విషయాలు అన్నీ తెలిసినా సంబంధిత అధికారు లు మిన్నకుండి చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వందల కోట్ల ఆదాయానికి గండి...!

శేరిలింగంపల్లి జోనల్ వ్యాప్తంగా ఆయా సర్కిళ్లలో సాగుతున్న నిర్మాణాలతో జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం చేకూరాలి, కానీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మాత్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సం స్థ ఆదాయానికి అధికారులే గండి కొడుతుంటే జీహెచ్‌ఎంసీ ఎప్పటికి కొలుకుం టుందో అని అందరి మెదడులో తోలుస్తున్న ప్రశ్న. అనుమతులు లేకుండా, అంతకు మిం చి సాగుతున్న నిర్మాణాలపై అధికారులు ఇప్పటికైనా దృష్టి దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను చర్యలు ఉంటాయా, ఉండవా? అని వేచి చూడక తప్పదు మరి.