27-06-2025 12:59:48 AM
- శంషాబాద్ డీసీపీ రాజేష్
రాజేంద్రనగర్, జూన్ 26: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని శంషాబాద్ డిసిపి రాజేష్ పిలుపునిచ్చారు. గురువారం శంషాబాద్ లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ ది నోత్సవం నాలుగు ప్రజల విద్యార్థులతో కలి సి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ మ హమ్మారి బారిన పడితే జీవితాలు నాశనం అయిపోతాయని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ఏసిపి, ఆర్ జిఐఏ ఇన్స్పెక్టర్ బాలరాజు, పోలీసు సిబ్బంది విద్యార్థులుపాల్గొన్నారు.