12 June, 2026 | 2:19 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పోక్సోపై విద్యార్థులకు అవగాహన

18-12-2025 01:50 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17 (విజయక్రాంతి): పోక్సో చట్టం, బాలల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, బాల్యవివాహాలు మొదలగు చట్టాల గురించి అవగాహన కల్పించిన,తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు,బుధవారం కామారెడ్డిలోని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి ఎల్ ఎస్ ఏ) కార్యదర్శి టి నాగరాణి  ముఖ్య అతిథిగా,పాల్గొని, కస్తూర్బా గాంధీ,

బాలికల పాఠశాలలోని విద్యార్థులకు పోక్స్ చట్టం, బాలల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, బాల్యవివాహాలు మొదలగు చట్టాల గురించి అవగాహన కల్పించారు.అనంతరం,కస్తూరిబాగాంధీ,బాలికల పాఠశాలలోని విద్యార్థుల, వసతి గృహంలో ఎల్లారెడ్డి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పాఠశాలలో  ఉన్న పిల్లల యొక్క వంటగదిని, స్నానపు గదులు, నిద్రించే చోట్లు తనిఖీ చేసి అందుకు ఆమె అసంతృప్తి చెందారు. పిల్లల యొక్క ఇతర అవసరాలను తెలుసుకొని తద్వారా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధికార న్యాయ సంస్థ అధికారిని  ఎం సుష్మ, కస్తూరిబాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్,సిబ్బంది  ఇతరులు తదితరులు పాల్గొన్నారు.