9 April, 2026 | 6:52 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

టీ20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్

16-12-2025 12:00 AM

రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్ అహ్మద్

లక్నో, డిసెంబర్ 15: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి అతను తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. నాలుగో టీ20కి ముందే షాబాజ్ అహ్మద్ జట్టుతో చేరనున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ అక్షర్ పటేల్ ఆడలేదు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అతని స్థానంలో చోటు దక్కింది.

తొలి రెండు టీ ట్వంటీల్లో ఆడిన అక్షర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టీ ట్వంటీలో భారత్ గెలిస్తే.. తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే మూడో టీ ట్వంటీలో భారత్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.