తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైన ‘అరణ్మనై’ చిత్రాల పరంపరలో రానున్న తాజా చిత్రం ‘బాక్’. సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్తో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘పంచుకో’ అనే గీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఖుష్బు సుందర్, ఏసిఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. రాశి ఖన్నా, తమన్నా భాటియా, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, కోవై సరళ తదితరులు తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రా నికి సంగీతం: హిప్ హప్ తమిళ, ఛాయాగ్రహణం: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ, కూర్పు: గురురాజ్, నృత్యాలు: బృందా.