calender_icon.png 27 July, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

26-07-2025 12:00:00 AM

కలెక్టర్ పీ.ప్రావీణ్య

జహీరాబాద్, జూలై 25 : రాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భముగా  కలెక్టర్  మాట్లాడుతూ బడి వయసు గల పిల్లలు ఎవరు బడి బయట ఉండకూడదని, అలాగే మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి  పాఠశాలలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపొందిం చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.  పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడాన్ని కలెక్టర్  గమనించారు. అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు.  ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.