27-07-2025 01:26:50 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’గా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. నోవాటెల్ హెఐసీసీలో లెక్స్ విట్నె స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్ట ర్ 2025 ఎడిషన్’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బా బు మాట్లాడుతూ ఒక న్యాయవాదిగానే తన ప్రస్థానం మొదలయ్యిందని, ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. అప్పటికీ, ఇప్పటికీ న్యాయవ్యవస్థలో అనేక మార్పులొచ్చాయని, ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు.
ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టు రూమ్లు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ లాంటివి అందుబాటులోకొచ్చాయని వివరించారు. న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, సమానత్వాన్ని అందించే వాస్తు శిల్పులు, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షులని కొనియాడారు.
ఇప్పుడు కేవలం న్యాయనిపుణులే కాదు
ఇప్పుడు న్యాయవాదులు అంటే కేవలం న్యాయనిపుణులు మాత్రమే కాదని, బిజినెస్ ఎనేబులర్లు, కాంప్లియెన్స్ నావిగేటర్లు, టెక్ ఇంటిగ్రెటేడ్ అడ్వుజర్లు అని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా న్యాయపరమైన కార్యకలాపా ల కోసం 63 శాతం పెద్ద భారతీయ కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ పైనే ఆధారపడుతున్నాయని నాస్కామ్ లీగల్ టెక్ రిపోర్ట్ 2025 స్పష్టం చేస్తోందన్నారు. హైదరాబాద్లో 120కి పైగా స్టార్టప్ కంపెనీలు ఈ-డిస్కవరీ, డిస్ప్యూట్ అనలిటిక్, వర్చువల్ ఐపీఆర్ ప్లాట్ ఫామ్స్ తదిత ర రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయని తెలిపారు.
5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు
దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో 5.15 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు గతేడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించిందని, వీటిలో కేవలం జిల్లా న్యాయస్థానాల్లోనే 4.56 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలోనూ 10 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు గణాంకా లు స్పష్టం చేస్తున్నాయని, ‘ఆలస్యమైన న్యా యం.. నిరాకరించబడిన న్యాయంతో సమా నం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా మాత్రమే చూ డొద్దని సమాజం పట్ల ఒక బాధ్యతగా భావించాలని సూచించారు. చట్టాన్ని తెలుసుకోవడ మే కాదు..మార్పులకు అనుగుణంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే నేర్పును అలవర్చుకోవాలన్నారు.
నిజమైన క్లయింట్ కేవలం మి మ్మల్ని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ మాత్రమే కాదని, మీపై ఆధారపడిన వ్యవస్థ అని కూడా గుర్తించాలని చెప్పారు. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లెక్స్ విట్నెస్ ప్రతినిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు కంపెనీల లీగల్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.