27-07-2025 01:24:39 AM
చేనేత రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థాన ఉందని, ఈ ఉత్పత్తులకు ఇప్పటికీ కూడా వన్నెతగ్గడం లేదని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు, కాటన్ చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇప్పటితరం యువత కూడా చేనేత ఉత్పత్తులను ఆదరిస్తోందని తెలిపారు. చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరుపై సచివాలయంలో శనివా రం సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆయా సంఘా ల ద్వారా వస్త్ర ప్రదర్శన చేపట్టాలని సూచించారు. మార్కె ట్లో డిమాండ్కు అనుగుణంగా, ఇతర వస్తువులతో పోటి పడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
సంప్రదాయ చేనేతలైన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ పితాంబరీ, మహదేవ్పూర్ టస్సర్ పట్టుచీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్ షీట్లు, అలంపూర్ టవల్స్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచాయని, వీటిని కూడా చేనేత దినో త్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వస్త్రప్రదర్శనలో ఆయా చేనేత సంఘాల ద్వారా ప్రదర్శించాలని మంత్రి తుమ్మల సూచించారు.
చేనేత రుణమాఫీ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి వారి ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందిరాక్రాంతి మహిళశక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరలను పరిశీలించి, వాటి ఉత్పత్తిని వేగవం తం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఇండెట్ల ప్రకా రం వస్త్రాలు, మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు నిత్యం పని కల్పించడం జరుగుతోందన్నారు. సమావేశంలో చేనేత జౌళీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.