కాంగ్రెస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు నరేందర్రెడ్డి
కరీంనగర్ సిటీ, ఏప్రిల్ 26: దేశంలోనే అసమర్థ ఎంపీ బండిసంజయ్ అని, ఆయనకు మాట్లాడే విధానం తెలియదని, భాషపై ఏమాత్రం పట్టులేదని సూడా చైర్మన్, పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రామా రాజకీయాలు, మత విద్వేషాలకు కేరాఫ్ అడ్రస్ బండి సంజయ్ అన్నారు. దామాషా ప్రకారం పార్లమెంట్ సెగ్మెంట్కు అభివృద్ధి నిధులు వస్తే, తన చొరవతోనే వచ్చాయని బండి సంజయ్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కు మతాశిశు కేంద్రం, తిరుపతి వె ళ్లే రైలుకు హాల్టింగ్.. ఇలా ఎంతో చేశారన్నారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన తండ్రి జగపతిరావు జిల్లాలో అనేక పదవులు అలంకరించారని గుర్తుచేశారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాజేందర్రావును నాన్లోకల్ అనడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు తాజ్, శ్రీనివాస్రెడ్డి, గన్ను మహేందర్రెడ్డి, రజితరెడ్డి పాల్గొన్నారు.