09-08-2024 12:26:26 PM
చెక్కుల చెల్లింపు (క్లియరెన్స్) ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూడా ఆర్ బీఐ చర్యలు ప్రతిపాదించింది. ప్రస్తుతం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)లో బ్యాచ్ల వారీగా చెక్కుల క్లియరింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇందుకోసం రెండు పనిదినాల వరకు సమయం పడుతోంది. "ఆన్ రియలైజేషన్ సెటిల్ మెంట్" పద్దతిలో నిరంతర క్లియరింగ్ పద్దతిని ప్రవేశపెట్టడంతో కొన్ని గంటలలోనే చెక్కులు క్లియర్ అయ్యేలా చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో వెల్లడించారు.