calender_icon.png 3 May, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-05-2025 01:31:28 AM

  1. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ’సీఈఐఆర్’ను సద్వినియోగం చేసుకోవాలి 
  2. రూ. 20 లక్షల విలువగల 102 మొబైల్ ఫోన్ల రికవరీ 

జగిత్యాల, మే 2 (విజయక్రాంతి): సాంకేతికత పెరిగిన ప్రస్తుత గ్లోబలైజ్డ్ సమాజంలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న 102 మంది బాధితులకు, రూ. 20 లక్షల విలువగల రికవరీ చేసిన ఫోన్లను ఎస్పీ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్  పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని, సదరు మొబైల్ ఫోను సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని ఎస్పీ పేర్కన్నారు. పోయిన సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ వ్బుసైట్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.

ఈ వ్బుసైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే, మొబైల ఫోన్లను ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు.  పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్‌ఎస్త్స్ర, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్లను రికవరీ చేసి సదరు బాధితులకు అందించడం జరిగిందన్నారు.

సిఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని, లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ సిఈఐఆర్ టీం ఆర్.ఎస్త్స్ర. కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్లు అజర్, యాకూబ్, మల్లేశంలను జిల్లా ఎస్పీ  అభినందించారు. తమ ఫోన్ పోయిన విధానాన్ని, ఫోన్ పోయి వాళ్లకు ఎదురైన చేదు అనుభవాలను బాధితులు తెలియజేశారు.

సాంకేతికతను  ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను కనిపెట్టి, తిరిగి తమకు ఇచ్చినందుకు బాధితులు ఆనందంతో ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి, డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు స్పందించక పోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అజ్ఞాత వ్యక్తులకు  ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసని, ఉగ్రవాదులతో సంబంధాలని, బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు.

ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించి, ఫిర్యాదు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.