calender_icon.png 20 October, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటాయించిన ఇండ్లలోకి లబ్ధిదారులు త్వరగా వెళ్లాలి

20-10-2025 12:00:00 AM

అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, అక్టోబర్ 19 : డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల లబ్ధిపొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల గృహప్రవేశం చేసి త్వరగా ఇళ్లలోకి త్వరగా వెళ్లాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని పరుమాల శివారు నందు గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను ఎమ్మె ల్యే పరిశీంచారు. ఇప్పటికే గృహప్రవేశం చే సిన ప్రజలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో నీటి సమస్యను పరిష్కారిస్తామని, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి ఒ క్కరు సద్వినియోగం చేసుకోవాలనారు.

ఇప్పటికే వరకు నీటి సమస్య విద్యుత్ సమస్య ను పరిష్కరించడం జరిగింది లబ్ధిదారులు చి న్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూ డా త్వరగా నాలుగు రోజుల పూర్తి చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా కృ షి చేస్తానని తెలిపారు.

భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ప టేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు అజ య్ చంద్రశేఖర్ ధర్మ నాయుడు, బాలాజీ, మొయినుద్దీన్ పరశురాముడు షాషా రాజు పాల్గొన్నారు.