20-10-2025 12:00:00 AM
22 నుంచి ప్రారంభం కానున్న శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
వేలాదిగా తరలిరానున్న భక్తులు
చిన్నచింతకుంట,అక్టోబర్ 19 : తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒక టిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలో ని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండ ల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా పే రుగాంచింది.
పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర చెబుతుం ది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కు రుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 వ రోజు న ఘనంగా ప్రారంభమవుతాయి. యాగశాల మండపాలంకర ణంతో పాటు భక్తుల రాకకు అవసరమైన ఏ ర్పాటు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది.
కురుమతి స్వామి వారి ప్రత్యేకత వేరు
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రా వడానికి రెండు రకాల పురాణ గాథలు చెబుతున్నాయి. తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల వృక్షాల తో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగిన ట్టు పురాణ గాథ చెబుతుంది.
ఇక్కడ కురు అనగా చేయుట, మతి అనగా తలచుట అని అర్ధం. అందుకే ఈ స్వామికి కురుమతి అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది కురుమూర్తిగా పిలుస్తున్నట్లు పెద్దలు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు చరిత్ర బట్టి చూస్తే అవగతం అవుతుంది.
ప్రస్తుత దేవరకద్ర నియోజక వర్గంలోని అమ్మాపూర్ ప్రాంతంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ముక్కెర వంశ మూలపు రుషుడు గోపాలరాయుడు నిర్మించగా.
1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపరచగా, సో మ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమలులోకి తెచ్చారని తెలుస్తోంది. 1870 లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కు రుమార్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టంగా ఉంటుంది . ఉద్దా లు అంటే పాదుకలు అని అర్ధం. స్వామి వా రి పాదుకలను ఊరేగింపు చేసే కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యతతో నిర్వహిస్తారు.
పాదుకలను దళితులు తయారు చేస్తారు
శ్రీ కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదేయరాని బంధం ఉంది. స్వామివారి పాదుకలను వడ్డెమాన్లోని ఉద్దాల మండపం లో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియ మ నిష్టలతో ఉపావాస దీక్షలతో స్వామి పా దుకలు ఉద్దాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు.
ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు. ఇది చా లా అరుదైన విషయం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కురుమూర్తి అనేక పోలిక లున్నాయి. ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపై నే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు. తిరుపతి క్షేత్రంపై మేరు పర్వత పుత్రుడైన ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడని పురణాలు చెబుతున్నాయి.
శ్రీ కురుమూర్తి కొండలు ఆనందగిరిలో భాగమేనని అచట వెలసిన స్వామి వారే ఇచ్చట వెలిశారని స్థల పురాణంలో చెప్పబడినది. తిరుపతిలో విఘ్నేశ్వరుని విగ్ర హం లేదు. కురుమూర్తిలో కూడా లేదు. వేంకటాచలం తో స్వామి నిల్చున్న భంగిమల్లో ఉండగా కు రుమూర్తి స్వామి అదే భంగిమలో ఉండడం విశేషం. తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నాట్లు కురుమూర్తిలో ఇక్కడా ఉన్నాయి.
అందుకే పేదల తిరుపతి గా , తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కు రుమూర్తి దేవస్థానం లో ఆ వెంకటేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్స వాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఉత్సవం , అలంకరణోత్సవాలతో పాటు స్వామి వారి కళ్యాణం వంటి ప్రధాన ఘట్టాలుగా ఉండనున్నాయి.
ప్రతియేటా కురుమూర్తి బ్రహ్మో త్సవాలకు సుమారు 2 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్నారని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు మాట. ఈ సారి ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు .
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు..
అక్టోబర్ 22న ధ్వజారోహణం, అష్టోత్తర శతకలశాభిషేకం, స్వామి కల్యాణం, మయూ ర వాహనసేవ నిర్వహించనున్నారు..
23న ప్రత్యేక పూజలు, హంసవాహన సేవ, 24న శేషవాహన సేవ, 25న ప్రత్యేక పూజలు, గజవాహన సేవ, 26న స్వర్ణాభరణాలచే అలంకారం, అశ్వవాహన సేవ, 27న హనుమంత వాహనసేవ, గరుడవాహనసేవ, 28న ఉద్దాలోత్సవం, 29న ఆవాహిత దేవతా పూజలు, హోమాలు, పుష్పయాగం, 30న అవభృత, మంగళ నీరాజనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.