13-06-2025 12:06:19 AM
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, జూన్ 12: భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగం గా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం మోదెల గ్రామం లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును తహసీల్దార్ దిలీప్ కుమార్తో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం నెహ్రూనగర్, గాంధీనగర్ లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పరిసరాలు, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం, మాట్లాడటం నేర్పించాలని, మెనూ ప్రకారం సకా లంలో పౌష్టికాహారం అందించాలని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపం ఉన్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలన్నారు.
పిల్ల లకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏక రూప దుస్తుల పంపిణీపై వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ గది నిర్మాణ పనులు సందర్శించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ప్రభుత్వ షెడ్యూ ల్ కులాల బాలికల వసతిగృహాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశా రు. మైనార్టీ, జిల్లా పరిషత్ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల గదులు, పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరు లు పాల్గొన్నారు.