19 May, 2026 | 11:28 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

15-09-2025 12:00 AM

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  గడ్డం వెంకటేష్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాం తి):  వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరా ట చరిత్రను బీజేపీ వక్రీకరించి నిజమైన పోరా ట చరిత్రను తప్పుదోవ పట్టిస్తోందని డివైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేష్ ఆరోపించారు.

ఆదివారం స్థానిక మాలీ సం ఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కనీసం పాత్ర లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విలీనం అని, విమోచనం అని చరిత్రను వక్రీకరించి చెబుతున్నారు అని అన్నారు. ఇదే కాకుండా రజాకార్, కేరళ స్టోరీ కశ్మీర్ ఫైల్ పేరుతో తప్పుడు చరిత్రను ఆధారంగా చేసుకొ ని చిత్రాలు నిర్మించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతాంగ పోరా ట చరిత్రను హిందూ, ముస్లిం పోరాటంగా చూపిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐబీజిల్లా కార్యదర్శి గొడి సెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, దుర్గం నిఖిల్, సహాయ కార్యదర్శిలు  శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.