10 May, 2026 | 11:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించాలి

30-07-2025 12:20 AM

కామారెడ్డి, జులై 29 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి విజయ డంక మోగిస్తానని రాష్ట్ర బిజెపి నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు లతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని వారు సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని జెడ్పిటిసి, ఎంపీపీ స్థానాలను బిజెపి కైవసం చేసుకునేలా కృషి చేస్తానని పైడి ఎల్లారెడ్డి ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని వారు ఈ సందర్భంగా సూచించినట్లు పైడి ఎల్లారెడ్డి తెలిపారు.