గొర్రెల పంపిణీ కుంభకోణం: హైదరాబాద్లో ఈడీ దాడులు
హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హయాంలో జరిగిన రూ. 700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఆరు చోట్ల దాడులు నిర్వహించింది. మాజీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్, కీలక నిందితుడు మొయినుద్దీన్, ఇతరుల ఇళ్లు, ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. మొదట్లో ఈ విషయంలో అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) కేసు నమోదు చేయగా, తరువాత ఈడీ కేసును చేపట్టింది. ACB పరిశోధనల ప్రకారం, ఈ పథకం అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, నకిలీ లావాదేవీలు, బినామీ ఖాతాల ద్వారా నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించబడింది. ఈ పథకాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) 20 జూన్ 2017న ప్రారంభించారు. యూనిట్కు అయ్యే రూ.1.25 లక్షల ఖర్చులో, ప్రభుత్వం 75శాతం ఖర్చును అందిస్తుంది. 25శాతం లబ్ధిదారుడు భరిస్తాడు. అయితే, అధికారులు, మధ్యవర్తులు నిధులను దుర్వినియోగం చేయడానికి ప్రారంభం నుండే కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది.






