calender_icon.png 31 July, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు

30-07-2025 01:29:33 PM

రాంచంద్రరావుకు పోనిశెట్టి ఆధ్వర్యంలో ఘన స్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి సారి పాల్వంచలో పర్యటించిన ఎన్. రాంచంద్రరావుకు బుధవారం పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై  స్వాగతించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలమాలలతో హర్షధ్వానాలతో రాంచంద్రరావు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయంగా నిలిపేందుకు రాంచంద్రరావు  నాయకత్వం కీలకమవుతుందన్నారు. పాల్వంచ ప్రజలు  పార్టీ కార్యకర్తల్లో ఈ పర్యటనతో కొత్త ఉత్సాహం నెలకొంది.