28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం

06-10-2025 02:28 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పదాధికారుల సమావేశంలో అవలంభించాల్సిన వ్యూహాలపై, ఇతరాలపై తగు నిర్ణయాలు తీసుకుందుకు బీజేపీ కమిటీల ఏర్పాటుపై  రేపు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ప్రకటన చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖారారు చేసేందుకు రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో జూటూరు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి ఉన్నారు.