27 March, 2026 | 9:54 PM

Breaking News

ఘనంగా పెద్దమల్లరెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం   •   కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •   సీఈఆర్ క్లబ్‌లో తాగునీరు సౌకర్యాలు కల్పించాలి   •  

రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం

06-10-2025 02:28 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పదాధికారుల సమావేశంలో అవలంభించాల్సిన వ్యూహాలపై, ఇతరాలపై తగు నిర్ణయాలు తీసుకుందుకు బీజేపీ కమిటీల ఏర్పాటుపై  రేపు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ప్రకటన చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖారారు చేసేందుకు రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో జూటూరు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి ఉన్నారు.