03-11-2025 03:22:15 AM
సుల్తానాబాద్ నవంబర్ 2 (విజయ క్రాంతి):రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడిచిన అభివృద్ధిని మరిచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని అగ్ర భాగాన నిలిపిన బిజెపి నేతలపై అనుచిత వాక్యాలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శమని బిజెపి పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఆదివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక పూసల చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టి ముఖ్యమంత్రి కి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన బిజెపి ప్రభుత్వంపై ,మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల పై, అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటని తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కు తీసుకొని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మండల ప్రభారీ కామని రాజేంద్రప్రసాద్,మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము తిరుపతి,జిల్లా కౌన్సిల్ మెంబర్ వెగోళం శ్రీనివాస్ సీనియర్ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు తదితరులుపాల్గొన్నారు.