calender_icon.png 22 June, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం మహాదానం

22-06-2025 06:00:14 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మార్వాడి యువ మంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ వారి సహకారంతో ఆదివారం బెల్లంపల్లి మహేశ్వరి భవన్లో రక్తదానం శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ... రక్తదానం మహాదానమని అన్ని దానాలలో కెల్ల రక్తదానం గొప్పదనం అన్నారు. ఈ సందర్భంగా 52 మంది రక్తదానం చేశారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అభినవ సంతోష్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బ్లడ్ క్యాంప్ ఇంచార్జ్ లు అభినవ సంతోష్ కుమార్,  సురభి శరత్ కుమార్ బ్లడ్ బ్యాంక్ సీనియర్ సూపర్వైజర్ మాధవి పిఆర్ఓ రాజేష్ టెక్నీషియన్ రాజ్ కుమార్, ఏఎన్ఎం రజిత,  హరీష్ మార్వాడి యువ మంచు బ్లడ్ క్యాంప్స్ చైర్మన్ అఖిల్ జవర్ బ్లడ్ క్యాంప్స్ కన్వీనర్ రాజేందర్ లహోటి యువ మంచు అధ్యక్షులు కృష్ణ కాంత్ సోనీ కార్యదర్శి బాల ప్రసాద్ మారు, కోశాధికారి కమల్ లహోటి ఆర్యవైశ్య యువన సంఘం అధ్యక్షులు పుల్లూరి వెంకటేష్,  కార్యదర్శి బాల సంతోష్ కోశాధికారులు బాల ప్రశాంత్ నల్మాస్ సంతోష్ తో పాటు ఆర్యవైశ్య సంఘం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.