calender_icon.png 22 June, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు"

22-06-2025 05:57:32 PM

విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కోతిమీర్ కర్ వినయ్ కుమార్

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో వ్యాపార సంస్థలుగా ప్రైవేట్ విద్యాసంస్థలు మారాయిని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్ధి సేన నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఆర్థికభారం మోపుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, పాఠశాలలు బలవంతంగా పుస్తకాలు, యూనిఫారాలు, స్టేషనరీ వస్తువులు తమ సరఫరాదారుల నుంచి కొనుగోలు చేయించేందుకు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు.

ప్రవేశ రుసుములు, వార్షిక ఫీజులు, యాక్టివిటీ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు తదితర వివిధ పేర్లలో వేలాది రూపాయల వసూలు చేయడం వల్ల మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతోనూ, విద్య నుండి దూరమవుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, పిల్లల కోసం ప్లేగ్రౌండ్, శుభ్రత, మౌలిక సౌకర్యాలు లేకుండా నడుస్తున్నట్టు పేర్కొన్నారు.

కొన్ని పాఠశాలలు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని, ఇది విద్యా ప్రమాణాలను, పిల్లల భవిష్యత్తును ముప్పులో పెట్టుతోందని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాధికారి (DEO)వెంటనే స్పందించి, ఈ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సేన తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు మధు గుమ్ముల, అమన్, ఇక్క శ్రీనివాస్,కరణ్, శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, అనిల్, బెనిన్, తదితరులు పాల్గొన్నారు.