calender_icon.png 6 June, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందిన బొడ్డుపల్లి మహేందర్

04-06-2025 11:09:10 PM

పలువురి అభినందనలు..

పెన్ పహాడ్: మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సైదలు-కమలమ్మల చిన్న కుమారుడు బొడ్డుపల్లి మహేందర్ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం(Jawaharlal Nehru Technological University)లో పీహెచ్డీ చేసారు. 13వ, స్నాత్కోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma), విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ టి కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పిహెచ్బి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ రీచర్చ్ ఎండో డెవలప్మెంట్ సెల్లో డాక్టర్. శోభారాణి ఆధ్వర్యంలో ఫార్మా కాలేజీ విభాగంలో ఎవల్యూయేషన్ అఫ్ హాపటో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఆప్ ఆన్ ఎక్య ఫ్లోరిడ్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ ఇన్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ ఇండ్యూ సీడ్ ఎనిమల్ మోడల్స్ అనే పరిశోధనలో పీహెచ్డీ పట్టా పొందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ, మండలంలోని స్నేహితులు, బంధువులు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.