05-06-2025 12:00:00 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్, జూన్ 4 ( విజయ క్రాంతి ) : వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్న డాటా ఎంతో కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశం మందిరంలో లెప్రసీ విభాగానికి సం బంధించిన నికుస్ట్ పోర్టల్లో కుష్టు వ్యాధిగ్రస్తు ల డాటా నమోదు చేయడంపై డాటా ఎంట్రీ ఆపరేటర్లకు, లెప్రసీ నోడల్ పర్సన్ లకు లెప్రా ఇండియా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి కామేశ్వర రావు, రాష్ట్ర శిక్షణ ప్రతినిధి నరసిం హ స్వామి, శిక్షణను ఇచ్చారు.
బుధవారం ఈ శిక్షణను ప్రారంభించిన అనంతరం డి.ఎం.అండ్.హెచ్.ఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల వివరాలు నిర్దేశిత సమయంలో ఆన్లైన్లో పొం దుపరచాలని సిబ్బందికి సూచించారు. ఆన్లై న్లో పొందుపరిచిన గణాంకాల ఆధారంగానే రాష్ట్రస్థాయిలో పథకాలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.
తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలను సకాలంలో ప్రతి నెల ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ పారామెడికల్ అధికారు లు వామన్ రావు, రమేష్, ఆయా పీహెచ్సీల నోడల్ పర్సన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.