calender_icon.png 5 December, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్

05-12-2025 12:47:20 PM

హైదరాబాద్: మదీనా-హైదరాబాద్, షార్జా- హైదరాబాద్ ఇండిగో విమానాలకు(Sharjah-Hyderabad IndiGo flights) ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) ఉద్రిక్తత నెలకొంది. షార్జా-హైదరాబాద్ విమాన్ శంషాబాద్ లో సురక్షితంగా దిగింది. శంషాబాద్ లో దిగాల్సిన మదీనా-హైదరాబాద్ విమానం అహ్మదాబాద్(Ahmedabad)కు మళ్లించారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసి స్థానిక విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాడు.

ముందు జాగ్రత్త చర్యగా, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ భద్రతా బృందాలు ప్రయాణికులందరినీ వెంటనే విమానంలోకి దింపి ఐసోలేషన్ జోన్‌కు తరలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విమానం, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. గురువారం, మదీనా నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని బాంబు బెదిరింపు(Bomb threat) కారణంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ముఖ్యంగా, ఈ వారం ప్రారంభంలో మంగళవారం కువైట్ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి మళ్లించారు.