27 April, 2026 | 2:44 AM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బోరు బండి లారీ..

27-04-2026 12:48 AM

మెదక్/నర్సాపూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బోరు బండి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో  బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

జనం ఎక్కవగా ఉండే సమయంలో, రద్దీ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో  పెద్ద ప్రమాదమే తప్పింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గజ్వేల్ నుండి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులకు పది మంది వరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని లారీని పిఎస్ కు తరలించారు.