calender_icon.png 1 May, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా టాపర్లుగా బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు

01-05-2025 12:15:20 AM

ఎంఈఓ సలీం షరీఫ్

కోదాడ ఏప్రిల్ 30: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా టాపర్లుగా నిల్చారని ఎంఈఓ, హెచ్‌ఎం సలీం షరీఫ్ బుధవారం తెలిపారు. తాళ్ళూరి రేఖశ్రీ 571 మార్కులు, కంపెల్లి నరేందర్ 549, ఎండి ఆసిఫా 526, షేక్ నహీద, 517, భరత్ నాయక్ 510, ప్రభు చరణ్ 506, వైష్ణవి 506 మార్కులు సాధించారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో ముందు స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  ఇన్చార్జీ హెచ్‌ఎం మార్కండేయ, దేవరాజు, శ్రీనివాసరెడ్డి, బడుగుల సైదులు, జానకిరాం, బ్రహ్మానందం, సురేష్ పాల్గొన్నారు.