17 April, 2026 | 11:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పది ఫలితాల్లో మెరిసిన షైన్ విద్యాసంస్థలు

01-05-2025 12:14 AM

వరంగల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో వరంగల్ నగరంలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులై విజయ పరంపర కొనసాగించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరుందిన షైన్ విద్యార్థులు జిల్లాకు తలమానికంగా నిలిచారని, షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’ నే కాదని, అన్ని రంగాల్లో తామే ముందుంటామని మరోసారి రుజువయిందని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ అన్నారు.

షైన్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు బి.ఆదిత్య దీక్షిత్ 588/600, జి. జ్ఞాన దీప్ 580/600, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ వరసగా 579/600 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సాయి శ్రీ 578/600, మని చందన 577/600,  కార్తిక, త్రిషిక పటేల్ 576/600, సంప్రీత్ 575/600, రాజేష్ 574/600 మార్కులతో ఉత్తీర్ణులై రికార్డు సృష్టించారని తెలిపారు.

ఇక తమ విద్యాసంస్థలకు చెందిన 23 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు, 53 మంది విద్యార్థులు 560 కి పైగా మార్కులు, 92 మంది విద్యార్థులు 550 కి పైగా మార్కులు, 371 మంది 500 కు పైగా మార్కులు సాధించి 15నై త్రీ నగరిలోనే కాకుండా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో గెలిచినట్లు చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు.

అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్లు పి. రాజేంద్ర కుమార్, మూగల రమ, ఐఐటి కోఆర్డినేటర్ మూగల రమేష్, ఎర్రగట్టు గుట్ట షైన్ చైర్మన్ జే. శ్రీనివాస్, ప్రిన్సిపాల్లు జి.రాజకుమార్, పి. విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ మానసిక వికాసం విలువలతో కూడిన విద్యను అందిస్తూ నూతన సమాజ నిర్మాణమే విద్యాసంస్థల లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు.