calender_icon.png 14 July, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి..

14-07-2025 05:35:38 PM

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు..

బాన్సువాడ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిఒక్క బీఆర్​ఎస్​ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(BRS Party Working President KTR), సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్​ రావు(MLA Harish Rao) సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం హైదరాబాద్​లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్​రావులు మాట్లాడుతూ.. త్వరలోనే బాన్సువాడ నియోజకవర్గానికి ఇన్​ఛార్జీని నియమిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం బాన్సువాడలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. లోకల్​బాడీ ఎలక్షన్లలో బాన్సువాడలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్​ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గ్రామాల్లో ఎండగట్టాలని వారు సూచించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో రైతులకు, మహిళలకు చేసిన అభివృద్ధి పనులను వివరించాలని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు. మంత్రులను కలిసిన వారిలో బీఆర్ఎస్​ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఎర్రవట్టి, బోడ రాంచందర్, శ్రీనివాస్, కుర్మ గంగారాం, లక్ష్మణ్, శంకర్, భూమన్న ఉన్నారు.