28 July, 2026 | 12:55 PM

Breaking News

నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •   కల్లూరులో SIR-2026 అమలుపై సమీక్ష సమావేశం   •   ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష   •  

దశదిశా కర్మ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

28-01-2026 07:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామ మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ తండ్రి రాములు ఇటీవల మృతి చెందారు. బుధవారం ఆయన దశదిశ కర్మ వేడుకలు చిన్న ఆత్మకూరు గ్రామంలో నిర్వహించడంతో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధర్యంతో ఉండాలని ధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, సాయిబాబా,పడమటి దుర్గేష్, పీకే రాజు, తదితరులు పాల్గొన్నారు.