13 April, 2026 | 1:46 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

దశదిశా కర్మ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

28-01-2026 07:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామ మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ తండ్రి రాములు ఇటీవల మృతి చెందారు. బుధవారం ఆయన దశదిశ కర్మ వేడుకలు చిన్న ఆత్మకూరు గ్రామంలో నిర్వహించడంతో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధర్యంతో ఉండాలని ధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, సాయిబాబా,పడమటి దుర్గేష్, పీకే రాజు, తదితరులు పాల్గొన్నారు.