మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య..
02-12-2024 10:37 AM
ప్రేమ వివాహం చేసుకున్న కోపంతో
సొంత తమ్ముడే హత్య చేసేందుకు ఒడిగట్టాడు
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోలు గ్రామంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ప్రేమ వివాహం చేసుకోవడంతో, అది సహించని తన సొంత తమ్ముడే ఆమెను హత్యకు ఒడిగట్టాడు. హత్యకు గురైన మహిళ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. దీనిపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




