26-05-2025 07:03:51 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయ సమీపంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందింది. గొల్లవాడ చెందిన సింగర వేణి శ్రీనివాస్ చెందిన గేదెను మేత కోసం విడిచి పెట్టగా మేత మేస్తూ.. ట్రాన్స్ఫారం దగ్గర విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సుమారు గేదె విలువ ఒక లక్ష రూపాయల వరకు ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. పాలు ఇచ్చే గేదె మృతి చెందడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.