10 March, 2026 | 11:00 PM

కాటేదాన్‌లో గంజాయి పట్టివేత

28-10-2024 12:02 AM

రాజేంద్రనగర్, అక్టోబర్27: ముగ్గురు కార్మికులు గంజాయి తాగుతుండగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయాలు జరిపినా, వినియోగించినా కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.