శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ టికెట్ల కలకలం
24-07-2026 11:30 AM
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో నకిలీ టిక్కెట్లతో దుబాయ్ వెళ్లే విమానం ఎక్కడానికి ప్రయత్నించిన ఇద్దరు నేపాలీలను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానయాన సంస్థ సిబ్బంది ఆ ఇద్దరు నేపాలీ పౌరుల టికెట్లను పరిశీలించగా, వారి వద్ద నకిలీ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. వారు RGIA పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






